మేడే శుభాకాంక్షలు: ఏపీ శివయ్య

చిత్తూరు: కార్మికులకి, కర్షకులకి, కార్మిక లోకానికి, సంఘటిత, అసంఘటి కార్మికుల లోకానికి జనసేన పార్టీ చిత్తూరు ఉమ్మడి జిల్లాల కార్యదర్శి ఏపీ శివయ్య మేడే శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా శివయ్య మాట్లాడుతూ శ్రామికుల పక్షాన పోరాడే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో పయనిస్తూ కార్మిక లోకానికి సేవ చేసుకుంటామని శివయ్య పేర్కొన్నారు. కార్మికులు, కర్షకులు, సంగటిత అసంఘటిత రంగాల్లో పనిచేస్తూ తమ రక్తాన్ని చెమట రూపంలో దారబోసిన వారందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ధనికులకి రాష్ట్ర ప్రభుత్వం కాపు కాస్తు సహాయ సహకారాలు అందిస్తూ, పేద కార్మికుల పొట్ట కొడుతుందని విమర్శించారు. ఉన్నవారికి సహకారం అందించినా, లేకపోయినా వారేమో పస్తులు ఉండరు. శ్రామికులు మాత్రం ఒక పూట తిని, తినక చమటోడుస్తుంటే.. వారి పక్షాన నిలవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ధనికుల పక్షాన పనిచేస్తూ.. పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నట్లు ప్రకటన చేస్తుంది. కోట్లాది రూపాయలు తన సంపాదనను రాజకీయ పార్టీ కోసం హెచ్చించి నికార్సైన నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఆదరించి పేదల ప్రభుత్వం తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్మికునికి ఉందని ఆయన తెలియచేశారు.