అసలైన అక్రమార్కులను వెలుగులోకి తేవాలి: శ్రీమతి వినుత కోటా

శ్రీకాళహస్తి పట్టణం, రాజీవ్ నగర్ కాలనీలో ఇళ్ళ పట్టాల అవినీతి పైన సోదాలు చెయ్యాల్సింది శ్రీకాళహస్తి వైసీపీ పార్టీ ఆఫీస్ లో మరియు స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో, ఎమ్మెల్యే కనుసన్నల్లోనే వేల కొద్ది ఇళ్ళ పట్టాలు దోపిడీ, వందల కోట్ల అవినీత జరిగింది. మొక్కుబడిగా చిన్న చిన్న ఉద్యోగుల ఇళ్లలో సోదాలు చేసి ప్రజలను మభ్యబెట్టే కార్యక్రమం తప్ప అసలైన అక్రమార్కులను వెలుగులోకి తేవాలని జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా డిమాండ్ చేసారు.