కీ|| శే|| ఇట్టబోయిన సాయి చరణ్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం పండ్లు పంపిణీ

జనగామ జిల్లా కేంద్రంలోని రాజరాజేశ్వరి అనాధాశ్రమంలో ఆదివారం క్రీస్తు శేషులు ఇట్టబోయిన సాయి చరణ్ పుట్టినరోజు సందర్భంగా వారి స్నేహితుడు గుజ్జులనలిన్ ఆధ్వర్యంలో అన్నదానం, పండ్లు పంపిణీ చేసారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ జిల్లా బిజెపి ఓబీసీ అధ్యక్షుడు గుజ్జుల నారాయణ మాట్లాడుతూ వృద్ధులకు అన్నదానం చేయడం చాలా తృప్తిగా ఉందన్నారు. చేరదీసిన ఆశ్రమ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. సేవ చేసేందుకు ప్రేరణ కల్పిస్తున్న పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్ సంస్థ సభ్యులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జోగు భాస్కర్, రంజిత్, జోగు ఉదయ్, శివ, గుజ్జుల రోహిత్, సాయి మను, నాని, ఆలకుంట్ల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.