అల్లూరి సీతారామరాజుకు పూసపాటిరేగలో ఘననివాళి

నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆదివారం పూసపాటిరేగలో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం నెల్లిమర్ల మండలం జరజాపుపేట గ్రామానికి చెందిన మద్దిల శివ విద్యుత్ శాఖలో లైనుమేనుగా విధినిర్వహిస్తుండగా గత శుక్రవారం ఉదయం 10గంటల ప్రాంతంలో మరణించారు. వారి కుటుంబాన్ని మధ్యాహ్నం 2 గంటలకు జనసేన పార్టీ మండల అధ్యక్షులు పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోర్డినేటర్ తుమ్మి లక్ష్మీరాజ్, రాష్ట్ర మత్స్యకార విభాగం కార్యదర్శి కారి అప్పలరాజు, డెంకాడ మండల అధ్యక్షురాలు పతివాడ కృష్ణవేణి, పూసపాటిరేగ మండల అధ్యక్షుడు జలపారి అప్పడుదొర(శివ), సీనియర్ నాయకులు బూర్లె విజయశంకర్, తొత్తడి సూర్యప్రకాష్,దుర్గాశి శేఖర్, పిన్నింటి గౌరీశంకర్,మోపాడ వెంకునాయుడు, శ్యామ్, దేశెట్టి వంశీ, చింతపల్లి సతీష్, మాదేటి ఈశ్వర్రావు, బలభద్రుని జానకీరామ్, లెంక సురేష్, విశ్వనాథ్ తదితర జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.