జనసేన ఆధ్వర్యంలో బోరింగు కోసం భూమిపూజ

మక్కువ మండలం పెదగయిశీల గ్రామంలో గత 20 సంవత్సరాలుగా త్రాగునీటి సదుపాయం లేక ఆ యొక్క గ్రామంలో ఉన్న ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్న విషయం మక్కువ మండల జనసేన పార్టీ దృష్టికి వచ్చింది. గత కొన్ని నెలలుగా జనసేన మండల నాయకులు గేదెల రిషవర్ధన్ ఆధ్వర్యంలో కొంతమంది అధికారులు దృష్టికి కొంత మంది నాయకులు దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగినది, కానీ ఎవ్వరు పట్టించుకోకపోవడంతో పెదగయిశీల గ్రామానికి వెళ్లి ఆ ఊరి పెద్దలతో మాట్లాడి తన సొంత నిధులతో బోరింగ్ వేస్తాను అని హామీ ఇవ్వడంతో ఆదివారం పెదగయిశీల గ్రామంలో బోరింగు వేసే ప్రదేశంలో భూమిపూజ చేసి బోరింగు పని మొదలు పెట్టడం జరిగింది.