జనం కోసం జనసేన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది : పోలిశెట్టి తేజ

ఇబ్రహీంపట్నం మండలంలో జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా తుమ్మలపాలెం జనసేన పార్టీ ఎంపీటీసీ సభ్యులు ఇబ్రహీంపట్నం మండల జనసేన పార్టీ అధ్యక్షులు పోలిశెట్టి తేజ మండలంలోని కిలేసపురం గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి జనసేన పార్టీ సిద్ధాంతాలను, మ్యానిఫెస్టోను మరియు స్థానిక మండల మేనిఫెస్టోను కరపత్రాల్లో పొందుపరిచి ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్క ఓటరుకు జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు లక్ష్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తున్నారని ఒక్క అవకాశం జనసేన పార్టీకి ఇవ్వాలని కోరుతున్నారు పోలిశెట్టి తేజ ఈ కార్యక్రమానికి విశేషాలను లభిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు కాకి శివశంకర్, కాకి బాబురావు, సురేష్, బాల, హనుమంతరావు, ఆనంద్ మరియు స్థానిక జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.