6వ రోజు జనవాణి – జన చైతన్య యాత్ర

చీపురుపల్లి నియోజకవర్గం, గరివిడి మండలం, బొండపల్లి గ్రామంలో రెడ్డి ప్రతాప్, పండు, మని, వెంకటేష్, రామ్, ధను, కళ్యాణ్ మరియు గ్రామ జనసైనికులు ఆధ్వర్యంలో 6వ రోజు జనవాణి – జన చైతన్య యాత్రలో భాగంగా బొండపల్లి గ్రామంలో ప్రతి గడపకు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ఆశయాలను, మేనిఫెస్టో తీసుకెళ్లడం జరిగింది. మరియు ముఖ్యంగా రైతులకు రుణమాఫీ కల్పించమని, వెళ్లిన ప్రతి ఇళ్లలో కుళాయి సమస్యలు మరియు హౌస్సింగ్ బిల్లు గురుంచి దీన్ని పరిష్కరించమని గ్రామ ప్రజలు వారి సమస్యలను తెలియపరిచారు. అలాగే గ్రామంలో మాకు ఊహించని అశేషమైన ప్రజల స్పందన లభించింది ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ కి ఒక అవకాశం ఇద్దాం అనే మాటే వినిపిస్తుంది. గ్రామం మొత్తం ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు సహకారం లభించినందున పవన్ కళ్యాణ్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఇలాగే మిగిలిన నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో కూడా పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను, ఆశయాలను సామాన్య ప్రజల కోసం ఆయన ఏం చేస్తారో అన్నది ప్రతి ఒక్కరికి తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ జనసైనికులు పెద్ది వెంకటేష్, అగురు వినోద్ కుమార్, గేడ్డి గొల్లబాబు, చందక బాలకృష్ణ, బాకూరి శ్రీను, లెంక జగదీశ్, పైల ధనుంజయ, రెడ్డి ప్రతాప్, చిరంజీవి మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.