తహశీల్దార్ కార్యాలయానికి డాక్టర్ పిల్లా శ్రీధర్ వినతిపత్రం

పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు మరియు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు ఒక ఎకరానికి 50 వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం అందించాలని పిఠాపురం నియోజకవర్గం రైతుల తరఫున పిఠాపురం తహశీల్దార్ వారికి వినతిపత్రం అందించడం జరిగింది. జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ముందుగా పిఠాపురం నియోజకవర్గ రైతులతో కలిసి తహసిల్దార్ వారి కార్యాలయం ముందు నిరసన తెలియజేయడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా నీట మునిగిన పంట వల్ల కళ్ళల్లో తడిచి మొలకెత్తిన ధాన్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎకరానికి 30 వేల రూపాయలు చొప్పున పెట్టుబడి అవ్వగా కౌలు రైతు ఎకరానికి 20 వేల రూపాయలు చొప్పున కౌలు ఇవ్వాలి మొత్తం 50వేల రూపాయలు అవుతుంది పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాల కారణంగా రైతు తీవ్ర నష్టానికి గురవుతున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే పంట నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరానికి 50 వేల రూపాయలు చొప్పున పంట నష్ట పరిహారం అందించాలని సంబంధిత తాసిల్దార్ వారి కార్యాలయానికి వినతిపత్రం అందిస్తున్నట్లు డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియా ముందు వాపోయారు. ఈ కార్యక్రమంలో భాగంగా గుర్రం గంగాధర్, సైతన రాజబాబు, జీను శ్రీను, గుర్రం గణేష్, కటారి చంటిబాబు, సైతన ఆనంద్ మరియు నియోజకవర్గ రైతులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.