నీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందని జగనన్నకు చెబుదాం

  • మీరే రాష్ట్రానికి పెద్ద సమస్య అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు
  • నాలుగేళ్లుగా అడుగుతున్నా రాని సమాధానం నాలుగు అంకెలకు ఫోన్ చేస్తే వస్తుందా అంటూ ఎద్దేవా
  • ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతీ ప్రభుత్వంలో ఉండే స్పందన కార్యక్రమమే ఇది
  • 2024లో జగనన్నకు బై బై చెప్పి, పవనన్నకు స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్దమయ్యారు
  • జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు, వైసీపీ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని ఇదే విషయాన్ని నీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయింది జగనన్నా అని రాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో చెబుతున్నారని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. జగనన్నకు చెబుదాం అంటూ వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమంపై ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతీ ప్రభుత్వం లో నిర్వహించే స్పందన కార్యక్రమానికే మసిపూసి మారేడు కాయ చేసి ప్రజాధనాన్ని , కాలాన్ని వృధా చేస్తున్నారని విమర్శించారు. నాలుగేళ్లుగా జగనన్నకు అర్ధమయ్యేలా చెప్పినా పరిష్కారం కానీ ప్రజల బాధలు , సమస్యలు నాలుగు అంకెల ఫోన్ నెంబర్ తో తీరుతాయా అని ఎద్దేవా చేశారు. ప్రజల భావోద్వేగాలతో ,బలహీనలతో ఆడుకునే ప్రశాంత్ కిషోర్ , ఐ ప్యాక్ సంస్థల వల్ల రాష్ట్ర రాజకీయాలు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రంగులు , స్టిక్కర్లు , బొట్టుబిల్లలు ఇప్పుడు జగనన్నకు చెబుదాం వంటి కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అయ్యే కార్యక్రమాలన్నీ ఐ ప్యాక్ సంస్థల నిర్వాకమే అని ధ్వజమెత్తారు. రాజధాని , ప్రత్యేక హోదా , పోలవరం , సీపీయస్ రద్దు , జాబ్ క్యాలెండర్ , మద్యపాన నిషేధం , గంజాయి అక్రమ రవాణా లాంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిన తరువాతే జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహిస్తే ప్రజలు హర్షిస్తారన్నారు. నాలుగేళ్ళ వైసీపీ పాలనలో రాష్ట్రం నలభై ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు రానున్న ఎన్నికల్లో జగన్ కు బై బై చెప్పేందుకు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారని ఆళ్ళ హరి అన్నారు.