షేక్ సుభానికి మనోధైర్యాన్నిచ్చిన బొర్రా వెంకట అప్పారావు

సత్తెనపల్లి నియోజకవర్గం, ముప్పాళ్ల మండలం, ముప్పాళ్ళ గ్రామానికి చెందిన ముస్లిం సోదరుడు షేక్ సుభాని (బచ్చా) ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తెలిసి సత్తెనపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావుకి ముప్పాళ్ళ మండల అధ్యక్షులు సిరిగిరి పవన్ కుమార్ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకటప్పరావు వెళ్లి వారిని వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్నివ్వడం జరిగినది. వారి కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి ఆ కుటుంబానికి 5000 రూపాయలు ఆర్ధికసాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముప్పాళ్ళ మండల అధ్యక్షులు సిరిగిరి పవన్ కుమార్, మండల వైస్ ప్రెసిడెంట్ గౌస్, కౌన్సిలర్ రంగశెట్టి సుమన్, రూరల్ మండలం అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, జాన్ పీరా వైస్ ప్రెసిడెంట్ రఫీ, గార్లపాడు సురేష్ గ్రామ జనసైనికులు మౌలాలి సుభాని బాజీ లాలు మబ్బులు తదితర జనసైనికులు పాల్గొనడం జరిగినది.