నవ వధువుకు తాళిబొట్టు, పట్టుబట్టలు అందజేసిన డాక్టర్ కందుల

వైజాగ్ సౌత్: సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా దక్షిణ నియోజకవర్గంలో నిర్వారామంగా పలు కార్యక్రమాలు చేపడుతున్న దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు నవ వధువుకు పట్టు బట్టలు, బంగారు తాళిబొట్టు అందజేశారు. 35వ వార్డు కల్లు పాకల ప్రాంతంలో కనకరాజు, లక్ష్మీ దంపతుల కుమార్తె నవవధువు మౌనికకు డాక్టర్ కందుల నాగరాజు బంగారు తాళిబొట్టు, పట్టుబట్టలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవే లక్ష్యంగా తాను ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా తాను చేయవలసిన సేవా కార్యక్రమాలను నిర్విరామంగా చేస్తున్నట్లు తెలిపారు. కుల మతాలకతీతంగా తను చేస్తున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి కూడా అనూహ్య స్పందన వస్తుంది అన్నారు. భవిష్యత్తులో కూడా తన సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 35వ వార్డు సీనియర్ జనసేన నాయకులు త్రినాధ్, రఘు, జాదేశ్,
సత్తిబాబు, కిరణ్, సాయి, అంతోని, కోదండమ్మ, వర, కుమారి, దుర్గ, రాజి, జానకి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

★38వ రోజుకు చేరిన పవనన్న బాట కార్యక్రమం.. డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో చేపడుతున్న పవనన్న బాట కార్యక్రమం 38వ రోజుకు చేరుకుంది. దక్షిణ నియోజకవర్గంలో పలు వార్డులలో నిర్విరామంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
ప్రతి చోట ప్రజలు డాక్టర్ కందుల నాగరాజుకు బ్రహ్మరథం పడుతున్నారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే ప్రజలకు చేయబోయే మంచి పనులను డాక్టర్ కందుల ప్రజలకు వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.