ఉపాధి కూలీలకు జనసేన ఆధ్వర్యంలో గ్లూకోజ్, చక్కెర పంపిణీ
నెల్లిమర్ల నియోజకవర్గం, డెంకాడ మండలం, జొన్నాడ గ్రామంలో ఎండలు మండుతున్నాయి. ఎండలు ఎక్కువగా వుండడం వలన కూలి పనులుచేసుకునే వారికి, వృద్ధులకు వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా మంది వడదెబ్బకు ఇబ్బంది పడడం గుర్తించి, చెరువు పనులు చేసుకునే వారు ఈ వడదెబ్బకు గురవడం తెలుసుకొని వారికి గ్లూకోజ్ మరియు చక్కెర జనసేనపార్టీ తరపున దిండి రామారావు ఆధ్వర్యంలో అందించడం జరిగింది. అదేవిధంగా జనసెన పార్టీ సిద్దాంతాల గురించి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సురేశ్, ప్రసాద్, ఆదినారాయణ, మహేష్, సుధాకర్, కిరణ్, పైడిరాజు మొదలగు జన సైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-17-at-1.29.33-PM-1024x459.jpeg)