పలు కుటుంబాలను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఇటీవల చొల్లంగి పేటలో వర్షాలు కారణంగా విద్యుత్ వైర్ తెగిపోవడం వల్ల తెల్లవారుజామున జీవనోపాధికి వెళుతున్న మత్స్యకార మహిళ మడద సత్యవతి మృతి చెందడం జరిగింది. వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చాడం జరిగింది. అలాగే ముమ్మిడివరం మండలం తోట్లపాలెం గ్రామానికి చెందిన కొప్పిశెట్టి అనసూయమ్మ అనారోగ్యంతో మృతి చెందారు వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంట తాళ్ళరేవు మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు ముమ్మిడివరం పట్టణ అధ్యక్షులు కడలి వెంకటేశ్వరరావు, గంజా యేసు, సలాది రాజా, జి వేమవరం సర్పంచ్ పుణ్యమంతుల సూరిబాబు, చల్లంగి పేట గ్రామ కన్వీనర్ రేలంగి శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ గంగబాబు కుంది దుర్గాప్రసాద్, గండి అనిల్, కొమ్మోజు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.