ఇచ్చిన మాట, నేరవేర్చిన: బొర్రా

సత్తెనపల్లి వడ్డవల్లి 16వ వార్డులోని శాస్త్రి నగర్ కు చెందిన పాస్టర్ సత్యానందం వారి కమిటీ సభ్యులు మహా పాదయాత్రలో భాగంగా సియోను దేవాలయములకు మరమ్మతులకు అలాగే అభివృద్ధికి ఆర్థిక సహాయాన్ని సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావుని కోరడం జరిగినది. ఇచ్చిన మాట మరవకుండా పాదయాత్ర, శ్రీరాజశ్యామల యాగం అనంతరం సీయోను దేవాలయము పాస్టర్ ను, కమిటీ సభ్యులను పిలిచి లక్ష పదహారు రూపాయలు(1.00,016) చెక్కును అందించిన బొర్రా. మాట మరవకుండా సహాయం చేసిన బొర్రాకు ఆత్మీయ సత్కారం చేసిన పాస్టర్ సత్యానందం చర్చి కమిటీ సభ్యులు కిరణ్ కుమార్, గోన జోయాబు, తాళ్లూరి ప్రేమాకుమార్, బండారు నాగరాజు, జిర్రా గణేష్. ఈ నగదును చర్చి మరమత్తులకు, అభివృద్ధికి ఉపయోగిస్తామన్న సభ్యులు.