కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళి

భారత రాజ్యాంగ నిర్మాత డా.బాబా సాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పరిధిలో తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ పలుచోట్ల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు భారీ సంఖ్య లో పాల్గొన్నారు.