బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళి

*నగర జనసేన పార్టీ కార్యదర్శి బొడ్డుపల్లి రాధాకృష్ణ

భారత రాజ్యాంగ నిర్మాత మరియు పితామహుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన సందర్భంగా వారికి గుంటూరు నగరంలో లాడ్జి సెంటర్ నందు ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుంటూరు నగర కార్యదర్శులు బొడ్డుపల్లి రాధాకృష్ణ మరియు కొర్ర శ్రీను నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు నగర కార్యదర్శి బొడ్డుపల్లి రాధాకృష్ణ ఒక ప్రకటనలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అనుసరించిన మార్గం మరియు వారు సూచించిన రాజ్యాంగం ఎంతో ముఖ్యమని దళిత బలహీన బడుగు వర్గాల అభ్యున్నతికి వారు చేసిన కృషి అభినందనీయమని తెలియజేశారు. ఆ మార్గాన్ని భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఆకాంక్షించారు. జనసేన పార్టీ గుంటూరు నగర కార్యదర్శి కొర్ర శ్రీను నాయక్ ఇప్పటికీ వారు సూచించిన మార్గాన్ని అనుసరిస్తున్నానని తెలియజేశారు.

Share this content:

Post Comment