మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గాజువాక నియోజకవర్గం జనసేన పార్టీ భారత్ జనసైనిక్స్ టీం ఆధ్వర్యంలో గాజువాక వీరమహిళలను ఘనంగా సత్కరించడం జరిగింది. జనసేన పార్టీ సీనియర్ నాయకులు గంధం వెంకట్రావు చేతుల మీదుగా కేక్ కటింగ్ చేసి, వీరమహిళలకు శాలువా కప్పి, మొక్కలు ఇచ్చి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో పోలరౌతు వెంకటరమణ 66 వార్డు అధ్యక్షులు, రెయ్యి రత్న 65 వార్డు అధ్యక్షులు, లంకల మురళీదేవి 70 వార్డు అధ్యక్షురాలు, మకా షాలిని 68 వార్డు అధ్యక్షురాలు, లంక లత (మాజీ కౌన్సిలర్) అల్లు రామారావు, గుంటూరు మూర్తి, కాదా రాజు, గాజువాక వీర మహిళలు, భారత్ జనసైనిక్స్ టీం తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment