ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ కి ఘన స్వాగతం

ఢిల్లీ ప్రయాణం అనంతరం తిరిగి రాజమహేంద్రవరం విమానాశ్రయం కు చేరుకున్న ఎంపీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ కి కొవ్వూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఉదయ్ శ్రీనివాస్ వారిని ఆప్యాయత పలకరించి నా విజయంలో భాగస్వాములైనారు మీరు అని చిరునవ్వుతో పలకరించారు. మార్చి 14వ తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి కాలర్ ఎగరేసి పండుగ జరుపుకుందాం మీరు ముందుగా పిఠాపురానికి రావాలని కోరడం జరిగింది. జనసేన పార్టీ కొవ్వూరు మండల అధ్యక్షులు సుంకర సత్తిబాబు, కొవ్వూరు నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు గంగుమళ్ళ స్వామి, జనసేన పార్టీ కొవ్వూరు టౌన్ నాయకులు పోలిశెట్టి శివ, జనసేన పార్టీ కొవ్వూరు మండల ప్రధాన కార్యదర్శి మైగాపుల బాలకృష్ణ, ఎంపీ ఉదయ శ్రీనివాస్ కి ఘన స్వాగతం పలికారు.

Share this content:

Post Comment