జనసేన క్రియాశీలక వాలంటీర్ లకు ఘన సన్మానం

దెందులూరు నియోజకవర్గం: పెదపాడు మండల జనసేన నాయకులు గరికపాటి నాగేశ్వరరావు(చంటి), కోటప్రోలు సురేశ్, మోగంటి పవన్ కుమార్, కోటప్రోలు ఫణి, వడ్డి భార్గవ్, పల్నాటి సాగర్, బాబు అనిల్ కుమార్, అప్పనవీడు, ఏపూరు గ్రామ వీరమహిళలు మరియు జనసైనికుల ఆధ్వర్యంలో పెదపాడు మండల జనసేన నాయకులు కోటగిరి వెంకట సుధాకర్, దెందులూరు నియోజకవర్గ ఐటీ కో-ఆర్డినేటర్ కోటప్రోలు ఫణి కుమార్ సభాధ్యక్షతన అప్పనవీడు గ్రామంలో పెదపాడు మండల జనసేన క్రియాశీలక వాలంటీర్ లకి సన్మానం మరియు పెదపాడు మండలం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, దెందులూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీతో సమావేశాల నిర్వహణ, సంప్రదింపుల సమన్వయ బాధ్యులు డా. వెంకటలక్ష్మి ఘంటసాల గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీతో సమావేశాల నిర్వహణ, సంప్రదింపుల సమన్వయ బాధ్యులు చలమలశెట్టి రమేష్ మరియు విశిష్ట అతిధులుగా ఉమ్మడి ప.గో.జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి ముత్యాల రాజేష్, ఉమ్మడి ప.గో.జిల్లా జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు ఉప్పు కల్కి రమేష్, బొడ్డు గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.