ముక్కినాడ గ్రామంలో వైస్సార్సీపీ కి భారీ షాక్
- ముక్కినాడ గ్రామంలో అధికార పార్టీ వైస్సార్సీపీ నుండి జనసేన పార్టీలో చేరిన ముఖ్యనాయకులు
రాజనగరం మండలం, ముక్కినాడ గ్రామంలో అధికార వైస్సార్సీపీ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు రాష్ట్రంలో అధికార పార్టీ చేస్తున్న అక్రమాలు, దౌర్జన్యాలు, దుర్మార్గపు పాలనపై విసుగుచెంది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్దాంతాలు నచ్చి రాజానగరం నియోజకవర్గంలో జనసేన – తెలుగుదేశం – బిజెపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ చేస్తున్న సేవా కార్యక్రమాలు, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా క్షేమం కోసం పాటు పడే విధానం నచ్చి నేడు 15 కుటుంబాలు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. వీరందరికీ జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన బత్తుల బలరామకృష్ణ. పార్టీలో చేరిన వారిలో అనదాసు శేషయ్య, అనాదాసు సాంబశివరావు, బి. శ్రీనివాస్, మహేష్, వెలుగు వినయ్, బి. శ్రీను, చాపల విజయకుమార్, శైలం వెంకటరమణ, వాకా శ్రీను, అనదాసు యుగంధర్, సోడసాని శ్రీను మరియు ఇతరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-28-at-7.21.39-PM-1024x575.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-28-at-7.21.40-PM-1024x576.jpeg)