జనసేన పోరాటంతో కదిలిన యంత్రాంగం

  • అధికారులకు ధన్యవాదాలు తెలిపిన కనపర్తి మనోజ్ కుమార్
  • పొన్నలూరు నుండి కామేపల్లి వరకు ఉన్న ప్రధాన రహదారిని నిర్మించిన అధికారులకు ధన్యవాదాలు

కొండపి నియోజకవర్గం: పొన్నలూరు మండలంలో జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులకు ధన్యవాదాలు తెలపడం జరిగింది. గత సంవత్సరం డిసెంబర్ 23వ తేదిన పొన్నలూరు నుండి కామేపల్లి వరకు ఉన్న ప్రధాన రహదారిని నిర్మించాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఈ ప్రధాన రహదారిలో ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉండేవి. ఈ ప్రధాన రహదారిని నిర్మించి ప్రజల ప్రాణాలను కాపాడాలని అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అధికారులు వెంటనే స్పందించి ఈరోజు పొన్నలూరు నుండి కామేపల్లి వరకు ఉన్న ప్రధాని రహదారిని నిర్మించి ప్రజల ప్రాణాలను కాపాడిన అధికారులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అని కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం నాయుడు, మహబూబ్ బాషా, ఖాదర్ బాషా, ఆంజనేయులు, పిల్లిపొగు పీటర్ బాబు, పెయ్యల రవి, సుంకేశ్వరం శ్రీను, సాయి, ప్రసాద్, భార్గవ్, తిరుమల్ రెడ్డి, కోటేశ్వరరావు, పోతురాజు మొదలైన పొన్నలూరు మండలం జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.