జనసేన క్రియాశీల కార్యకర్తల సమావేశం

డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ మరియు జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పి. గన్నవరం నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యులకు చెక్కులు పంపిణీ తరువాత అంబాజీపేట వేదికగా వందలాది జనసైనికులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పిఏసి సభ్యులు వివిధ నియోజకవర్గాల ఇంచార్జులు, రాష్ట్రస్థాయి మరియు జిల్లా స్థాయి కార్యవర్గ సభ్యులు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.