రంగా పేరు మీద స్మృతి వనం ఏర్పాటు చేయాలి.. రంగా వర్ధంతి వేడుకల్లో పోతిన

  • వంగవీటి మోహన రంగా పేరు మీద స్మృతి వనం మరియు ఒక పథకానికి రంగా పేరు ఏర్పాటు చేయాలి
  • రంగా కుటుంబంపై వివక్ష చూపుతున్న సీఎం జగన్
  • రాధాకృష్ణ గారిని రాజకీయంగా ఉపయోగించుకుని వదిలేసినప్పుడు మరియు రెక్కీ నిర్వహించినప్పుడు కొడాలి నాని లాంటి వైసిపి నాయకులు ఎందుకు అండగా నిలవలేదు
  • రాజకీయ లబ్ధి కోసమే ఊసరవెల్లి ప్రకటనలు నేడు వైసిపి నాయకులు చేస్తున్నారు
  • వెల్లంపల్లి శ్రీనివాస్ తడిగుడ్డ లేకుండా గొంతులు కోసే వ్యక్తి

విజయవాడ: వంగవీటి మోహన్ రంగా 34వ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్, బందర్ రోడ్ లోని రంగా విగ్రహానికి వంగవీటి రాధాకృష్ణ గారితో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రంగా గారు మరణించిన 34 సంవత్సరాల తర్వాత కూడా కోట్లాదిమంది హృదయాల్లో నేటికీ కొలువై ఉన్నారని, బడుగు బలహీన వర్గాల సమస్యలపై నిరంతరం పోరాటం చేశారని, ఇళ్ళ పట్టాల కోసం, లాకప్ డెత్ ల పైన అలుపెరగని ఉద్యమాలు చేసినందువల్లే నేటికీ వారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలబడ్డారని, రంగా గారి పేరు తలవకుండా రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడికి విజయం సాధ్యపడదని, రంగా గారి పేరును ఒక జిల్లాకు ప్రకటించాలని కోరిన సీఎం జగన్ గారు రంగా గారి కుటుంబంపై వివక్ష చూపారని, ఎన్నికలకు ముందు రంగా గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, నేడు అవసరం తీరాక కనీస స్పందన లేదని, నిజంగా జగన్ గారికి చిత్తశుద్ధి ఉంటే విజయవాడ నగరంలో వంగవీటి మోహన్ రంగా గారి స్మృతి వనం ఏర్పాటుతో పాటు, ఏదో ఒక పథకానికి వారి పేర్లను ప్రకటించాలని డిమాండ్ చేశారు. కొంతమంది వైయస్ఆర్సీపీ నాయకులు రాధాకృష్ణ గారి మంచితనాన్ని ఆసరాగా తీసుకొని రాబోయే ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారని, రాధాకృష్ణ గారు కోరుకుంటే పదవులు డబ్బు వారి వెనక నడిచి వస్తాయని, రాజకీయ లబ్ధి పొందేలా మాట్లాడుతున్నారని మరి 9 సంవత్సరాలు పాటు వైఎస్సార్సీపీకి సేవ చేస్తే 2019లో రాధాకృష్ణ గారికి అసెంబ్లీ సీటు కేటాయించనప్పుడు కొడాలి నాని లాంటి నాయకులు ఏమయ్యారని, 2022లో రెక్కీ నిర్వహించినప్పుడు కనీసం స్పందించని ఈ నాయకులు నేడు రాజకీయంగా లబ్ధి పొందేందుకే నేడు మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారని, ఇటువంటివారిని వంగవీటి రంగా గారి అభిమానులు, అనుచరులు, అదేవిధంగా రాధాకృష్ణ గారి అభిమానులు ఇటువంటి ఊసరవెల్లి నాయకులకి రాబోయే ఎన్నికల్లో తప్పక బుద్ధి చెప్పి తీరుతారన్నారు. అనతరం పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఏర్పాటు చేసిన వంగవీటి మోహన్ రంగా గారి వివిధ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న పోతిన వెంకట మహేష్ ముందుగా నేరుబొమ్మ సెంటర్.. నేరుబొమ్మ సెంటర్ వద్ద 51వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు భక్తుల వెంకటేష్ మరియు పోతిన శివ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం 750 మందికి అన్నదానం ఏర్పాటు చేసినారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ నెహ్రూ బొమ్మ సెంటర్లో 2020 సంవత్సరంలో రంగా గారి వర్ధంతి కార్యక్రమాన్ని చేయనివ్వకుండా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అనేక ఇబ్బందులకు గురి చేశారని నేడు ఎన్నికలు సమీపిస్తున్నందున రంగా గారి విగ్రహానికి పూలమాలలు వేసి రాజకీయ లబ్ధి పొందాలని డ్రామాలాడుతున్నారని, అదేవిధంగా రాధాకృష్ణ గారిపై రెక్కీ నిర్వహించిన వ్యక్తులకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన దుర్మార్గుడని, ఇటువంటి వ్యక్తులను రాజకీయాల నుండి పూర్తిగా సమాజం నిర్మూలించకపోతే తీవ్రమైన నష్టం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర కాపు సంఘం అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, బిజెపి నాయకులు అడ్డూరి శ్రీరామ్, జనసేన పార్టీ నాయకులు పులి చేరి రమేష్, స్టాలిన్ శంకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోతిన బేస్ కంటేశ్వరుడు, బిజెపి నాయకులు బాగవల్లి శ్రీధర్ బీసీ నాయకులు పట్నాల హరిబాబు, తాత్రాజుల నరేష్, డివిజన్ అధ్యక్షులు పొట్నూరి శ్రీనివాసరావు, షేక్ అమీర్ భాష, తిరుపతి సురేష్, ఆకుల రవిశంకర్, బుద్ధన ప్రసాద్ ప్రముఖ న్యాయవాది పెళ్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిట్టినగర్ సెంటర్ వద్ద 48వ డివిజన్ అధ్యక్షులు కొరగంజి వెంకట రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 300 మందికి ఆపిల్ ఆరెంజ్ పండ్లను పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో వేవిన నాగరాజు, పల్లి శెట్టి ఉమా, తమ్మిన రఘు, సాంబ, నాగరాజు, చిన్న, నాని తదితరులు పాల్గొన్నారు. అనంతరం చెరువు సెంటర్ వద్ద 44వ డివిజన్ అధ్యక్షులు మల్లెపు విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రంగా గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 250 మంది పేదలకు పళ్ళు పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో మల్లెపు సురేష్ ,గంజి పవన్, తోట కోటి, స్టాలిన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కుమ్మరిపాలెం సెంటర్ వద్ద 38 మరియు 39వ డివిజన్ అధ్యక్షులు తమ్మిన లీలా కరుణాకర్ మరియు ఏలూరు సాయి శరత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 300 మంది పేదలకు యాపిల్ పండ్లను పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో గన్ను శంకర్, దారా రాము, భరత్, నాని, తదితరులు పాల్గొన్నారు.