శాశ్వత పరిష్కారం చూపాలి: మాధవరెడ్డి

శేరిలింగంపల్లి, దశాబ్దాల కాలంగా వరద నీటి కారణంగా రైల్వే అండర్ బ్రిడ్జ్ నుండి వెళ్లే వాహనదారులకు, పాదచారులకు కలిగే సమస్యల నుండి శాశ్వత పరిష్కారం చూపాలంటూ జనసేన పార్టీ శేరిలింగంపల్లి ఇంఛార్జి మాధవ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే చందానగర్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న సబ్వే పరిస్థితి కూడా ఇలాగే ఉందని, అకాల వర్షాలకే వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటే రాబోయే వర్షాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేమని మాధవరెడ్డి అన్నారు. చందానగర్ రైల్వే స్టేషన్ సబ్వేని సందర్శించిన మాధవరెడ్డికి స్థానికులు తమ బాధలను చెప్పుకున్నారు. అనంతరం ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలంటూ జోనల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అరుణ్ కుమార్, శ్రావణ్ కుమార్ జి ఎస్ కే, నరేష్, ఉపేంద్ర, రాజేష్ గౌడ్, అశోక్, రాజు, ఉదయ్, ప్రవీణ్ సాహూ, బాలాజీ నిఖిల్, రోహిత్, సాంబ మరియు జనసైనికులు పాల్గొన్నారు.