శాశ్వత పరిష్కారాన్ని చూపాలి
శేరిలింగంపల్లి, దశాబ్దాలుగా వరద నీటిలో మునుగుతున్న లింగంపల్లి బ్రిడ్జి సమస్యపై జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ జనసైనికులతో జోనల్ కమిషనర్ మరియు డిప్యూటీ కమిషనర్ ని కలిసి సమస్యను వివరించడం జరిగింది. శాశ్వతమైన పరిష్కారాన్ని చూపాలని వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో శేరిలింగంపల్లి జనసేన పార్టీ కోఆర్డినేటర్ డాక్టర్ మాధవ రెడ్డి, చందానగర్ డివిజన్ అధ్యక్షులు అరుణ్ కుమార్, జనసైనికులు శ్రవణ్ కుమార్ జి ఎస్ కే, కామరాజు, ఉపేంద్ర, ప్రశాంత్, నరేష్ మరియు ఇతర జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-03-at-18.28.13-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-03-at-18.28.14.jpeg)