తెలంగాణ ప్రజానీకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి: మేకల సతీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా, తెలంగాణ ఎన్నికల కసరత్తులో భాగంగా కోదాడ నియోజకవర్గంలో జనసేన పార్టీపై ఆకర్షితులైన యువతను పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర పర్యవేక్షణ కమిటీ సభ్యులు ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంఛార్జి మేకల సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ నాయకులు కొందరు హద్దులు దాటి తెలంగాణపై, తెలంగాణ సంస్కృతిపై, తెలంగాణ ప్రజానీకంపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపబట్టారు. వెంటనే వైసిపి నాయకులు తెలంగాణ ప్రజానీకానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేనియెడల తెలంగాణలో ఏ ఒక్క వైసీపీ నాయకుల్ని మంత్రులను ఎమ్మెల్యేలను తిరగనివ్వమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గం నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.