చోడిపల్లి పేట గ్రామంలో పాఠశాల భవనం నిర్మించాలి: జనసేన డిమాండ్

నెల్లిమర్ల: భోగాపురం మండలం, చోడిపల్లి పేట గ్రామంలో ప్రాథమిక పాఠశాల భవనం నిర్మాణం చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార విభాగ కార్యదర్శి కారి అప్పలరాజు భోగాపురం స్పందనలో ఈవోపీఆర్డి సురేష్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంపడం జనసైనికుడు ప్రమోద్ పాల్గొన్నారు.