ఆశయ సంస్థ వ్యవస్థాపకులు రెడ్డి రమణకు చిరు సన్మానం

చీపురుపల్లి: కొండ శంభం గ్రామంలో యువకుడు జనసేన నాయుకుడు గొర్లే చిన్నం నాయుడు ఆధ్వర్యంలో ప్రజా సేవకుడు, ఆశయ సంస్థ వ్యవస్థాపకులు రెడ్డి రమణ కు చిరు సన్మానం జరిగింది. ఈయన సేవలను గుర్తించి యువశక్తి కార్యక్రమంలో గౌరవనీయులు పవన్ కళ్యాణ్ లక్ష రూపాయల చె్కను అందించిన విజయం తెలిసినదే. ఇదే గ్రామానికి చెందిన కళాకారులు సి.హెచ్ దుర్గారావు, నారాయణమ్మ, శాంతమ్మలకు కూడా ఈ సందర్భంగా సన్మానం చేయడం జరిగింది.