పిఠాపురం జనసేన అధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళి

తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం నియోజకవర్గంలోని కందరాడ గ్రామాల్లో శుక్రవారం భారత రాజ్యాంగ నిర్మాణ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన జనసేన పార్టీ ఇన్చార్జ్ పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి మాకినీడి శేషకుమారి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణం ఏర్పడిన రోజని, దేశ ప్రజలందరికీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎంతో గొప్పగా విలువలతో కూడిన భారత రాజ్యాంగాన్ని నిర్మించినఒదులకు, ప్రతి ఒక్కరూ మన దేశంలో పూర్తి స్వేచ్ఛ, స్వతంత్ర హక్కులతో జీవించుచున్నారని, మన భారత రాజ్యాంగం, ప్రపంచ దేశాల్లోకెల్లా ఎంతో పటిష్టమైందని, శక్తివంతమైనదిగా తీర్చిదిద్దిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఇవే మా జోహార్లు అని అన్నారు. ఉదయం ముందుగా కందరడ గ్రామంలోని పెద్దలు మాసా పెద పుద్రయ్య, వాకపల్లి సూర్య ప్రకాష్ కన్నా బత్తుల వెంకటరమణ, మాట్లాడ అనిల్ కుమార్, పల్లెటి అప్పారావు పవన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాన్ని నీటితో కడిగి, శుభ్రంచేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి చీకట్ల శ్యామ్ కుమార్, రూరల్ అధ్యక్షురాలు తోలేటి శిరీష, కందరాడ ఎంపీటీసీ పిల్లా సునీత(దినేష్), చిత్రాడ ఎంపీటీసీ దూలపల్లి రత్నం, రూరల్ ఉపాధ్యక్షులు వాకపల్లి సూర్య ప్రకాష్, ప్రధాన కార్యదర్శి అడపా శివరామకృష్ణ, ప్రచార కార్యదర్శి పెంకే జగదీష్, మండల కమిటీ సభ్యులు కొండపల్లి శివ, బుర్రా విజయ్, రామిశెట్టి సూరిబాబు, మోటూరి మహేష్, కందా సోమరాజు పుణ్య మంతుల సూర్యనారాయణమూర్తి, పట్టా శివ, దొడ్డి దుర్గాప్రసాద్, సూరడా శ్రీను, పంతడ దుర్గాప్రసాద్, సురేంద్ర, కర్రీ హరిబాబు, పులి వెంకట రమణ, సింగిరి మల్ల సురేష్, నాని, శివ, నాగు, పట్టా సూరిబాబు, కీర్తి నాగు, గుడాల విష్ణు, సిద్ది బుజ్జి, చింతల మధు, పల్ల సందీప్, వీర మహిళలు కేతినిడి గౌరీ నాగలక్ష్మి, వినుకొండ శిరీష, నవీన్, మరియు జనసైనికులు పాల్గొన్నారు.