రామగుండం నియోజకవర్గ జనసేన ముఖ్య నాయకుల ఆత్మీయ సమావేశం

రామగుండం నియోజకవర్గం: పాలకుర్తి మండల హెడ్ క్వాటర్ లో జనసేన పార్టీ పాలకుర్తి మండల అధ్యక్షుడు బూస శ్రీనివాస్ యాదవ్ మండల నాయకులు బోదాసు అశోక్ ల ఆధ్వర్యంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ మూల హరీష్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనా విధానాన్ని జనసేన పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పై పోరాడాలని నాయకులకి కార్యకర్తలకి పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని అందుకు సంబంధించిన కార్యచరణ జరుగుతుందని ఒకటి రెండు వారాల్లో అన్ని మండలాల్లో పార్టీ కార్యాలయాలు అలాగే గ్రామల్లో పార్టీ జెండా గద్దెలు, బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. రామగుండం యొక్క వర్గానికి సంబంధించిన 50 మంది పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రావుల మధు, చల్లా శివారెడ్డి, వీరమహిళలు, నాయకురాలు కానిగంటి మంగ, మేకల రాజ్ కుమార్, గోపి కృష్ణ, మంథని శ్రావణ్, రవికాంత్, సాయి, లింగం బాలు, మేకల సంతోష్, పుప్పాల సత్తిష్, గుడిసెల మహేందర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.