చౌటుప్పల్ లో జనసేన నాయకుల ఆత్మీయ సమావేశం
చౌటుప్పల్ కేంద్రంలో జనసేన పార్టీ ముఖ్య నాయకుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జనసేన పార్టీ మునుగోడు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గోకుల రవీందర్ రెడ్డి విచ్చేశారు. సమావేశంలో భాగంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక మండల సమస్యలని అడిగి తెలుసుకున్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-21-at-5.23.35-PM-1024x488.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-21-at-5.23.36-PM-1024x682.jpeg)