కోటికేశవరం గ్రామంలో ఎన్.డి.ఏ కూటమి అభ్యర్థుల ఆత్మీయ సమావేశం

రాజానగరం: కోరుకొండ మండలం, కోటికేశవరం, బొల్లెద్దుపాలెం, రాఘవపురం, గరగలంపాలెం గ్రామాల ఉమ్మడి ఆత్మీయ సమావేశం కోటికేశవరం గ్రామంలో జరిగినది.. ఈ కార్యక్రమానికి రాజమండ్రి పార్లమెంట్ ఎన్.డి.ఏ కూటమి అభ్యర్థిని శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారు, రాజానగరం నియోజకవర్గం ఎన్.డి.ఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ, రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి, రాజానగరం నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి, మాజీ శాసనసభ్యులు చిట్టూరి రవీంద్ర, నందమూరి రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ ప్రజలందరూ సంతోషంగా జీవించడానికి.. రాజానగరం నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి రాజమండ్రి పార్లమెంట్ కూటమి అభ్యర్థిగా నాకు బాలట్ లో 4వ నంబర్ లో ఉన్న కమలం గుర్తుకు ఓటు వేయాలని…అలాగే రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గారికి బాలట్ లో 5వ నంబర్ లో ఉన్న గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీల నాయకులు కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు భారీగా పాల్గొన్నారు.