ముద్రగడని పిఠాపురం పంపటంలో ఒక బలమైన కుట్ర!

  • పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వెళ్ళే జనసైనికులకు విజ్ఞప్తి: ఉద్రేకాలు, అవేశాలు వద్దు- అలోచన, వివేకంతో అడుగులు వేయాలి

మదనపల్లె: ముద్రగడని కావాలని పిఠాపురం పంపటంలో ఒక బలమైన కుట్ర ఉన్నదని జనసేన నాయకులు జనసైనికులకు మీడియా పూర్వకంగా విజ్ఞప్తి చేసారు. అదేమిటంటే కావాలని ముద్రగడతో పవన్ కళ్యాణ్ గారి పైన రెచ్చగోట్టే ప్రసంగాలు చేయిస్తారు. దానిని రాజకీయ విమర్శలుగా తమ నీలి మీడియాల ద్వారా మరియు కూలి ఎనలిస్టుల ద్వారా ప్రచారం చేయిస్తారు. తదుపరి కాపు నాయకుడిపైన దాడి చేస్తున్న జనసైనికులు అని చెబుతారు. అవసరమైతే, ముద్రగడ పైన తమ వర్గాల వారితో దాడులు కూడా చేయించవచ్చు. దానిని జనసైనికుల పైన, పవన్ కళ్యాణ్ గారి పైన రుద్దటానికి ప్రయత్నిస్తారు. తద్వారా కాపుల మధ్యన తంటులు పెట్టటానికి మరియు జనసేన తరపున నిలబడిన కాపులకు, బీసీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించటానికి ఒక బలమైన రాజకీయ విష ప్రచారం మొదలు పెడతారు. ఇది కేవలం మొదటి దశ కుట్ర మాత్రమే. ఇక్కడ మరోక ముఖ్యమైన విషయం కూడా గమనించాల్సిన ఆవశ్యకత ఉన్నది. మనతో ఉండి, మనవారిగా ఉండి వైకాపా అనుకూలంగా కోవర్టు పనులు చేసే వారు కూడా ఉంటారు. వీరి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. వీరిని కూడా విధ్వంస, విద్వేష పూరిత కార్యక్రమాలకు కూడా వాడుకోవచ్చు. ఇక్కడ ఏవరినీ నూటికి నూరు పాళ్ళు నమ్మటానికి వీల్లేదు. కాబట్టి కరుడుగట్టిన జనసైనికులు సదా అప్రమత్తతో ఉండాలి. ఇలా పోనూ పోనూ పలు కుట్ర పూరిత విధానాలు పలువురితో చేయిస్తారు. అందుకు అవసరమైతే ఏంత సోమ్ములైనా వెదజల్లుతారు. కాబట్టి, వైకాపా వారిని, ముద్రగడ లాంటి వారిని ఏమాత్రం పట్టించుకోకుండా, కేవలం పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా వాతావరణం ఏర్పడేలా మాత్రమే దృష్టి పెట్టాలి.