ప్రజా అభిప్రాయం మేరకు వాటర్ ట్యాంక్ నిర్మించాలి

  • జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గ సమన్వయకర్త మర్రాపు సురేష్

గజపతినగరం: బొండపల్లి మండలం, బొండపల్లి గ్రామం ఎస్సీ కాలనీ ప్రజలు వాటర్ ట్యాంక్ సమస్యను జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గ సమన్వయకర్త మర్రాపు సురేష్ కు జనసేన పార్టీ దృష్టికి తీసుకుని వచ్చారు. స్థానిక అధికార పార్టీకి చెందిన నాయకులు వాటర్ ట్యాంక్ నిర్మాణం కొరకు గృహ సముదాయం ఉన్నచోట నిర్మించడానికి స్థానిక అధికార పార్టీ నాయకులు నిర్ణయం తీసుకున్నారు. దీన్ని వేరే ప్రాంతంలో నిర్మించాలని దీనిపై జనసేన పార్టీ సమన్వయకర్త సురేష్ గారికి ఎస్సీ కాలనీ ప్రజలు వాటర్ ట్యాంక్ సమస్య తెలియజేశారు. శనివారం ఈ ప్రాంతాన్ని మర్రాపు సురేష్ సందర్శించి, నేరుగా ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలుకి అనుకూలంగా అనువైన ప్రాంతంలో వాటర్ ట్యాంక్ నిర్మించాలని, స్థానిక అధికార పార్టీ నాయకులకు, బొండపల్లి ఎమ్మార్వోకి, గ్రామ సెక్రెటరీకి, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొండుపల్లి టిడిపి మండల అధ్యక్షులు బండారు బాలాజీ, జనసేన నాయకులు ఆధాడ మోహన్ రావు, బొండపల్లి జనసేన నాయకులు రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.