పార్వతీపురంలో ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం

పార్వతీపురం, మార్చ్ 14 వ తారీఖున జరగబోవు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను విజయవంతం చేయడం కోసం పార్వతీపురం నియోజకవర్గం సమన్వయకర్త ఆదాడ మోహనరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా అరకు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంపూరు గంగులయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయడం కోసం పార్వతీపురం నియోజకవర్గం నుంచి అదే విధంగా అరకు పార్లమెంట్ పరిధి నుంచి అత్యధిక ఎక్కువమంది క్రియాశీలక సభ్యులు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొనే విధంగా ప్రతి ఒక్క జనసేన నాయకులు, కార్యకర్తలు జనసైనికులు బాధ్యత తీసుకొని పనిచేయాలని, 11 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత అధికారంలోకి వచ్చి చేసుకుంటున్న ఆవిర్భావ సభని విజయవంతం చేయాలని నాయకులకు కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం సమన్వయకర్త నిమ్మక నిబ్రహం, కురుపాం సమన్వయకర్త కడ్రక మల్లేశ్వరరావు అరుకు పార్లమెంట్ వైస్ చైర్మన్ రెడ్డి కరుణ, సీతానగరం మండల అధ్యక్షుడు పాటి శ్రీను, బలిజిపేట మండల అధ్యక్షుడు బంకురు పోలినాయుడు, పార్వతిపురం పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పిన్నింటి జయకృష్ణ, పార్వతీపురం మాన్యం జిల్లా సీనియర్ నాయకులు కార్యకర్తలు, జనసైనికులు వీర మహిళలు పాల్గొనడం జరిగింది.

Share this content:

Post Comment