కోడుమూరులో ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం

కోడుమూరు, మార్చి 14న పిఠాపురంలో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతంగా నిర్వహించేందుకు ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ & జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్త చింతా సురేష్ బాబు పిలుపునిచ్చారు. బి.తాండ్రపాడులోని జనసేన పార్టీ ఆఫీస్ లో కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త ఆకెపోగు రాంబాబు ఆధ్వర్యంలో ఆవిర్భావ సభ ఏర్పాట్లపై నియోజకవర్గ నాయకులతో సమావేశం నిర్వహించి, ఆవిర్భావ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చింతా సురేష్ బాబు మాట్లాడుతూ, జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక జరగనున్న తొలి సభ కావటంతో జనసైనికులు, వీర మహిళలు ఉత్సాహంగా సభకు హాజరయ్యేలా పిలుపు ఇచ్చారు. కోడుమూరు నియోజకవర్గం నుండి అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఈ సభలో పాల్గొని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని అన్నారు. జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కోడుమూరు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పిఠాపురం సభలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment