పుంగనూరు, జనసేన పార్టీ 12వ ఆవిర్బావ దినోత్సవ వేడుక మార్చి 14వ తేదీన పిఠాపురంలో జరుగుతున్న నేపథ్యంలో నాయకుల్ని, కార్యకర్తల్ని సమన్వయ పరిచేందుకు రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చెయ్యడం జరిగింది. అందులో భాగంగా పుంగనూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన రాజంపేట పార్లమెంటు ఇంచార్జ్ అతికారి కృష్ణకి పుంగనూరు నియోజకవర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చిన్నా రాయల్, నాయకులు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి శాలువా కప్పి పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అతికారి కృష్ణ మాట్లాడుతూ మార్చి 14న పిఠాపురంలో జరిగే ఆవిర్బావ సభకు కార్యకర్తలు నాయకులు వీరమహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. పండుగ వాతావరణంలో ఈసారి సభ ఉంటుందని అధక్షులు పవన్ కళ్యాణ్ వేదికపై నుండి దిశానిర్దేశం చేస్తారని లక్షల్లో కార్యకర్తలు, నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం చలో పిఠాపురం పోస్టర్స్ విడుదల చేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని మండలాల, గ్రామ పంచాయతీల నుండి జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Share this content:
Post Comment