యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. లోపల ఉన్న అధికారులు, ఉద్యోగులను బయటకు వెళ్లకుండా తలుపులు బిగించి సోదాలు నిర్వహిస్తున్న ఆఫీసర్లు. మొదటగా డాక్యూమెంట్ రైటర్ వద్ద నుంచి అధికారులు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కొనసాగుతున్న సోదాలు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.