ఘనంగా క్రియాశీలక కార్యకర్తల ప్రమాద బీమా కిట్లు పంపిణీ కార్యక్రమం

ఉమ్మడి కృష్ణాజిల్లా, నూజివిడు నియోజకవర్గం, చాట్రాయి మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో.. చాట్రాయి గ్రామ వేదికగా.. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ మరియు క్రియాశీలక కార్యకర్తల ప్రమాద భీమా కిట్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. చాట్రాయి మండల జనసేన పార్టీ అధ్యక్షులు అరిల్లి కృష్ణ ఆధ్వర్యంలో.. సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మరిదు శివరామకృష్ణ, నూజివీడు నియోజకవర్గ నాయకులు, బండారు రాజు, తుమ్మల జగన్, పాశం నాగబాబు, రామిశెట్టి తేజస్వని, తుమ్మల పుష్పలత, మండల అధ్యక్షులు అరిలీ కృష్ణ, మండల కార్యవర్గం, మండల నాయకులు భారీ ఎత్తున జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

పార్టీకి చెందిన జన సైనికుడు ఇలాసరుపు శ్రీకాంత్ యాక్సిడెంట్లో కాలు కి గాయం ఆవగా.. జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్.. ఇతర నాయకులు శ్రీకాంత్ ని పరామర్శించి.. రెండు వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది.