త్రుటిలో తప్పిన ప్రమాదం – సమస్యపై స్పందించిన జనసేన

పాలకొల్లు: పట్టణ పరిదిలోని ఎనిమిదవ వార్డులో జరిగిన సంఘటనపై పాలకొల్లు పట్టణ జనసేన వెంటనే స్పందించింది. వివరాలలోనికి వెళితే సోమవారం స్కూలు పిల్లలను తీసుకువెళుతున్న భారతీయ విద్యా భవన్ స్కూల్ బస్సు ఎనిమిదో వార్డు నుంచి బైపాస్ రోడ్డు కి చేరుకునే మార్గంలో సరైన రోడ్డు మార్గం లేకపోవడం, తవ్విన కచ్చా డ్రైన్ వలన స్కూలు బస్సు ఒక పక్కకు ఒరిగిపోయి త్రుటిలో ప్రమాదం తప్పింది. బస్సులో విద్యార్థులకు పెనుప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న పిల్లలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ రోడ్డును వెంటనే బాగుచేయ్యక పోతే జనసేన నాయకులు అందరూ ఆ ప్రాంతానికి చేరుకుని స్థానికుల సహకారముతో శ్రమధానంచేస్తామన్నారు. ప్రాంతాన్ని పరిశీలించి ఒక సంవత్సరం క్రితం శాంక్షన్ అయిన రోడ్డుని ఇంత వరకూ ఎందుకు పూర్తి చేయలేదు. ఈ రోడ్లు ఇంత ఆధ్వానంగా ఉండటం వలన సుమారు 10 పాఠశాలలు, కళాశాలాలకు వెళ్లే విద్యార్థినీ, విద్యార్థులు జరిపాడిపోతున్నారు. ఈ రోడ్డు చాలా అధ్వాన్నంగా ఉంది. దీనిన పై వెంటనే స్పందించి, భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా అధికారులు రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయాలనీ కోరుతున్నాము. లేదంటే జనసైనికులు స్వచందంగా స్థానిక ప్రజలతో కలిసి శ్రమాధానం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమములో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు సిడగం సురేంద్ర, సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి కొమ్ముల దినేష్, ఉపాధ్యక్షులు పినిశెట్టి శ్రీనివాస్, విన్నకోట గోపి, తులా రామలింగేశ్వరరావు, యాళ్ల రవీంద్ర, బిట్ట లక్ష్మీనారాయణ, ఆచంట రామకృష్ణ, బొద్దని శిరీష్, అలుగు సత్తిబాబు, మద్దాల వెంకట్, మిడిమించి చిన్ని, చెన్ను మనోజ్, లంక సాయి, తంగెళ్ళ సత్తిపండు, పోకల సాయి తదితరులు పాల్గొన్నారు.