మహిళలపై దాడులకు పాల్పడుతున్న నిందితులను వెంటనే శిక్షించాలి: వాసగిరి మణికంఠ
గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో.. ఆంధ్రరాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులకు పాల్పడుతున్న నిందితులను వెంటనే శిక్షించాలని కొవ్వొత్తులతో నిస్వార్థ జనసైనికులు, నాయకులతో కలసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ రాయల్ మాట్లాడుతూ.. మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులకు పాల్పడుతున్న నిందితులను వెంటనే శిక్షించాలని జనసేన తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/vlcsnap-2022-05-08-23h06m44s093.png)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/vlcsnap-2022-05-08-23h06m47s920.png)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/vlcsnap-2022-05-08-23h07m03s062.png)