ఆచార్య షూటింగ్ అప్డేట్..
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కలయికలో తెరకెక్కుతున్న మూవీ ఆచార్య. కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ సిద్దా పాత్రలో నటిస్తున్నాడు. రాంచరణ్ కి జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది. మరికొన్ని రోజుల షూటింగ్ ఉందనగా కరోనా మహమ్మారి కారణంగా ఆచార్య షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మిగిలి ఉన్న షూటింగ్ ను పూర్తి చేయాలనీ చిత్ర యూనిట్ సిద్ధం అవుతుంది.
జూలై 8 నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని సినీ వర్గాల సమాచారం. పన్నెండు రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఇందులో ఏడు రోజుల పాటు జరిగే షూటింగ్లో రామ్చరణ్ పాల్గొంటారు. ఇందులో ఓ యాక్షన్ సన్నివేశం, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఈ చిత్రీకరణ పూర్తయిన తర్వాతే రిలీజ్ డేట్పై ఓ క్లారిటీ ఇస్తారట. భారీ అంచనాలున్న ఈ సినిమాలో చిరంజీవి, చరణ్ నక్సలైట్స్ పాత్రల్లో కనిపించనున్నారు. నిరంజన్ రెడ్డి, రామ్చరణ్ నిర్మాతలు.