అచ్యుతాపురం ఫార్మా ఘటన బాధాకరం.. జనసేన జానీ

పాలకొండ: అనకాపల్లి అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో శుక్రవారం జరిగిన భారీ పేలుడు ఘటనపై జనసేన జానీ స్పందిస్తూ.. ఫార్మా కంపెనీలో భారీ పేలుడు జరిగిన సందర్బంలో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను గత మూడేళ్ళ క్రితమే విశాఖ మరియు కోస్తా ఆంధ్రాలో ఇండస్ట్రియల్ సేఫ్టీ ఆడిట్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు. అయినా అటు ప్రభుత్వం గానీ కంపెనీ యాజమాన్యం, స్థానిక నాయకులు గానీ పట్టించుకోకపోవడం వల్లనే ఈ రోజు ఇంతటి గోరమైన పేలుడు సంబవించింది అని జనసేన జానీ ఇటు ప్రభుత్వం, అటు యాజమాన్యం తీరుపై మండి పడ్డారు. ఇప్పుడు ఆ ప్రాణాలు ఎవ్వరు తీసుకొస్తారు అని ఒక సామాన్య వ్యక్తిగా అడుగుతున్నాను అని చనిపోయిన ప్రతి కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం, అలానే చనిపోయిన కుటుంబానికి సంపురాణమైన ఆర్దిక సహాయంతో పాటుగా హాస్పిటల్ లో ఉన్నటువంటి వ్యక్తులకి సరైన ప్రెవేట్ హాస్పిటల్ లో వైద్యం చెయ్యించాలి అని అన్ని రకాలుగా ఆ కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉండాలి అని, అలానే ఇంతటి గోరానికి బాద్యులు ఎవ్వరు అనేది కనిపెట్టి, సరైన శిక్ష విధించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ జనసేన జానీ తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.