రాజోలు జనసేన ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

రాజోలు నియోజకవర్గం, పొదలాడ గ్రామంలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆపత్కాలంలో కార్యకర్తలకు అండగా నిలిచేందుకే క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ అమలులోనికి తెచ్చారని, జనసేన కార్యకర్తలు అందరూ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన గ్రామ శాఖ అధ్యక్షులు పంచదార చిన్న బాబు, రావూరి సాయి గెల్లి రామ దుర్గారావు, సాధనాల ప్రసాదు, సాధనాలు గణేష్, చిరిగినేడి శ్రీను, మేడిచర్ల యుగంధర్, తదితరులు పాల్గొన్నారు.