మల్కాపురంలో శరవేగంగా కొనసాగుతున్న క్రియాశీలక సభ్యత్వ నమోదు

విశాఖ పశ్చిమ నియోజకవర్గం: భారత దేశ చరిత్రలో ఏ పార్టీ చెయ్యని విధంగా కార్యకర్తలకు అండగా నిలబడేటట్టు, జీవిత బీమా బద్రతతో కూడిన సభ్యత్వ భవితవ్యాన్ని జనసేన పార్టీ అందించడం జరుగుతుంది. జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్యంగా యువత భారీ సంఖ్యలో తమ సభ్యత్వాలను నమోదు చేసుకుంటున్నారు. జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయానికి తగ్గట్టు అధిక శాతంలో యువత క్రియాశీలకంగా వాలంటీర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.. దీనిలో భాగంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం, పారిశ్రామిక ప్రాంతం, మల్కాపురం 61వ వార్డులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం జనసైనికులు మోహన్, సంతోష్, ప్రేమ్, వంశీ, గాంధీ, షంఖర్, అభి, తులసీలచే శరవేగంగా కొనసాగుతుంది.