ఆపదలో ఆదుకున్న జనసేన క్రియాశీలక సభ్యత్వం

  • క్రియాశీలక సభ్యుడు సునీల్ కు 50,000 ఇన్సూరెన్స్ చెక్ అందజేత

రైల్వేకోడూరు: ఉమ్మడి కడపజిల్లా, రైల్వేకోడూరు నియోజక వర్గం, ఓబులవారిపల్లి మండలం మంగంపేట గ్రామములో పేద కుటుంబానికి చెందిన పాస్యం సునీల్ జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త. సునీల్ ఇటీవల బైక్ యాక్సిడెంట్ లో తీవ్రముగా గాయపడి, తిరుపతిలో చికిత్స చేయించుకుని కోలుకున్నాడు.. క్రియాశీలక సభ్యత్వం ఉన్న సునీల్కు ఇన్సూరెన్స్ క్లెయిమ్ శాంక్షన్ అయి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వచ్చిన 50,000 రూపాయలు చెక్ ను రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మరియు నియోజక వర్గ నాయకులు బాధితుడి గృహానికి వెళ్లి వారి తల్లి తండ్రుల సమక్షంలో అందచేశారు. వారు ఈ సహాయానికి, ఇలాంటి కార్యక్రమాన్ని రూపొందించిన పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ.. 3వ విడత సభ్యత్వ కార్యక్రమం ఫిబ్రవరి 10వ తారీఖు నుండి ప్రారంభమగును, కావున ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలియపరిచారు.. ఈ కార్యక్రమాన్ని ఒక పండుగలాగ ఏర్పాటు చేసిన మంగంపేట గ్రామ పెద్దలు గునిపాటి శివయ్య, నారదాసు కృష్ణయ్య, కందుకూరి సుబ్రమణ్యం, జనసేన యువనాయకులు హనుమంతు సునీల్, లావలూరు సుమన్, గంటా వెంకట రమణ(రాజ), మంగారపు సాయి, 5మండలాల నుంచి విచ్చేసిన పగడాల వెంకటేష్, గందంశెట్టి దినకర్ బాబు, మాదాసు నరసింహ, ఆలం రమేష్, పసుపు లేటి రమణ, దాసరి వీరేంద్ర, నగిరిపాటి మహేష్, అంకిశేట్టీ మణి, సాయం శ్రీధర్, ముద్దపోలు సభాపతి, ఉత్తరాది శివకుమార్ మరియు వైకోట నుంచి చవ్వాకుల రెడ్డిమని, నల్లంశెట్టి కిషోర్, లీగల్ సెల్ నాగభూషణం, కొమ్మినేని బాలు, గిరి తదితరులు పాల్గొన్నారు.