ఆపదలో ఆదుకున్న జనసేన క్రియాశీలక సభ్యత్వం
- క్రియాశీలక కార్యకర్తకు ప్రమాదబీమా చెక్ అందజేత
అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట నియోజకవర్గం, ఎస్ రాయవరం మండలం, భీమవరం గ్రామములో పేద కుటుంబానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త ఇటీవల బైక్ ఆక్సిడెంట్ లో తీవ్రముగా గాయపడి వైద్యం చేయించుకుని కోలుకున్నాడు.. క్రియాశీలక సభ్యత్వం ఉన్న ఇతనికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ శాంక్షన్ కాగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుండి పవన్ కళ్యాన్ 30,000 రూపాయలు చెక్ ను పంపించి, బాధిత కార్యకర్తకు పంపించవలసినదిగా సూచించారు. ఈ మేరకు క్రియాశీలక వాలంటీర్ లింగంపల్లి జ్యోతి కుమార్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి మరియు యువ నాయకులు గెడ్డం చైతన్య, బాధితుడి గృహానికి వెళ్లి వారి తల్లిదండ్రులకు భీమవరం గ్రామం నాయకులు మరియు జనసైనికుల సమక్షంలో అందజేయడం జరిగింది. అలాగే ఆ ప్రాంత జనసైనికులతో శివదత్ కొన్ని పార్టీ విషయాల గురించి వివరిస్తూ, వారి సమస్యల గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లింగంపల్లి ప్రసాద్, పప్పల శివ, శంకర్, లింగంపల్లి బాలకృష్ణ, భీశెట్టి సతీష్, తాకాశి కిషోర్, మడగల నానాజీ, మడగల రాజు, రామకృష్ణ, జానీ, బద్రి, అశోక్, నవీన్, రాంబాబు మరియు ఆ గ్రామం ప్రజలు మరియు జనసైనికులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-12-at-4.21.12-PM-1024x544.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-12-at-4.21.12-PM-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-12-at-4.21.12-PM-2-1024x544.jpeg)