మారికవలసలో క్రియాశీలక సభ్యత్వ నమోదు

భీమిలి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కార్యకర్తల క్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రియాశీల సభ్యత్వం నమోదు కార్యక్రమం భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ డా.సందీప్ పంచకర్ల ఆదేశాల మేరకు 5వ వార్డ్ మారికవలసలో ఏర్పాటు చెయ్యడం జరిగింది. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకోని మరికొంత మందిని ప్రభావితం చేసేవిధంగా గతంలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతీ ఒక్కరూ రెన్యువల్ చేసుకోవడానికి, మరియు కొత్తగా క్రియాశీలక సభ్యత్వం పొందడానికి భీమిలి నియోజకవర్గం 5వ వార్డ్ మారికవలస ఆర్.జి.కె కాలనీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర దేవర శివ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటలకు వరుకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా జనసేన పార్టీని, జనసేన సిద్ధాంతాలను ప్రజలోకి తీసుకొని వెళ్లి జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శేఖరి శ్రీను బాబు, బీవీ కృష్ణయ్య, ఒమ్మి దేవి యాదవ్ యడ్ల గణేష్ యాదవ్, నారాయణ రావు, సునీల్, సూరి, సూరిబాబు, ఆదినారాయణ, అప్పలనాయుడు, జే సురేష్, లక్ష్మణ్, కిరణ్, చందాక సురేష్, శంకర్, ఈశ్వర్ రావు, త్రినాధ్, రాజుగారు, ధర్మారావు, సత్య, సింహాచలంనాయుడు, మహేందర్, చైతన్య, ప్రకాష్, రవి బంగారు రెడ్డి, సీతంనాయుడు, తదితరులు పాల్గొన్నారు.