గడప గడపకి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

సత్యవేడు నియోజకవర్గం, వరదయ్యపాలెం మండలం, మత్తెరిమిట్ట గ్రామంలో గడప గడపకి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జనసేన వీరమహిళ శిరీష జనసైనికులతో కలసి నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ప్రతీ ఇంటికీ వెళ్లి క్రియాశీలక సభ్యత్వం యొక్క ఆవశ్యకతను ప్రజలకు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు మురగయ్య, వసంతమ్మ కమలమ్మ, మోహన్, నందయ్య, మల్లి, తదితరులు పాల్గొన్నారు.