మెల్లవాయి పంచాయతీ పరిధిలో జనసేన పార్టీలో చేరికలు

మడకశిర మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు టి.శివాజీ ఆధ్వర్యంలో మెల్లవాయిపంచాయతీ నుండి పలు గ్రామాల నుండి 50 మంది యువకులు జనసేన పార్టీలోకి చేరటం జరిగింది. జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం రేపటి భావితరాల భవిష్యత్ కోసం యువకులే నాంది పలకాలని పల్లె గ్రామాలే ఈ రాష్ట్రానికి పచ్చ తోరణం అని పార్టీ విధివిధానాల గురించి టి. శివాజీ అధ్యక్షులు వివరించడం జరిగింది. వాళ్ల మాటలకు ప్రభావితమై జనసేన పార్టీలోకి చేరుతున్నామని యువకులు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు , మండల కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.